Download Now Banner

This browser does not support the video element.

ఫింగర్ ప్రింట్ ఎస్ఐకి సీఐగా పదోన్నతి:ఎస్పీ అభినందనలు

Rayachoti, Annamayya | Sep 4, 2025
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం, ఫింగర్ ప్రింట్ సబ్‌ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ కె.రవీంద్రారెడ్డి సీఐగా పదోన్నతి పొందిన సందర్భంగా, జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడుని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛంతో కలిశారు. ఎస్పీ గారు సీఐ గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...పోలీసు సేవలో కృషి, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తే పదోన్నతి సహజం. బాధ్యతలు పెరిగినకొద్దీ నిబద్ధత, సేవాభావం మరింత పెరగాలి. పదోన్నతి కేవలం గౌరవం కాదు, అది మరింత కర్తవ్యబాధ్యతను గుర్తు చేసే అంశం" అని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us