Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదరావడంతో , కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జ్ఞాన సరస్వతి, సాధారణ పుష్కర ఘట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తుంది. పుష్కర ఘాట్లపై గోదావరి ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12. 500 మీటర్ల మేరా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.