విద్యుత్ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరుల ఆశయాలను సాధిస్తామని కోడుమూరులో సీపీఐ నాయకులు అన్నారు. గురువారం కోడుమూరు కోట్ల సర్కిల్లో సీపీఐ నాయకులు అమరవీరులను స్మరించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు కృష్ణ మాట్లాడుతూ బషీర్బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిని గుర్తు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని లేదంటే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.