గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు లో ఓం జీసస్ అల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శుక్రవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం వల్ల లక్షలాదిమంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వారు తెలిపారు. ఈ సందర్భంగా గుడ్లవల్లేరు సెంటర్లో నిరసన చేపట్టి, కళాశాల నుండి సెంటర్ వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలపై ఎమ్మార్వోకి వినతి పత్రాన్ని అందజేశారు.