మంచిర్యాల పట్జణంలోను జాఫర్ నగర్ లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పట్టణ సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఎస్సై తిరుపతి గూడెల్లి సాయికుమార్ని అరెస్ట్ చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని బల్లార్షాలో 250 గ్రాముల గంజాయి కొనుగోలు చేసి మంచిర్యాలకు తిరిగి వస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.