నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు శనివారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సోఫీనగర్, కేజీబీవీ, గురుకుల పాఠశాల, ఇందిరమ్మ కాలనీ, డి మార్ట్, సాగర్ కన్వేన్షన్, సిద్దాపూర్ వాటర్ వర్క్స్, విద్యానగర్ కాలనీ, శివాజీ చౌక్, ఆదర్శనగర్, రామ్ నగర్, గాయత్రీపురం, ఆస్రా కాలనీ, ఈద్గామ్, భాగ్యనగర్, ఫిష్ మార్కెట్, సిద్ధాపూర్ కాలనీలో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినియోదారులు సహకరించాలని కోరారు.