శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని కోవెలగుట్టపల్లిలో విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం పుట్టపర్తి విద్యుత్ కార్యాలయంలో AE సాయినాథ్ గౌడ్కు వినతిపత్రం అందజేశారు. గతంలో కలెక్టర్, ఎమ్మెల్యేకి PGRS ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. త్వరితగతి లో లో-ఓల్టేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.