గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మతసామరస్యం వెళ్లి విరిసింది. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శనివారం లడ్డును వేలం వేశారు. ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రిన్ రూ. 1,88,888 లక్షలకు వేలంపాడి లడ్డూను దక్కించుకుంది. ఒక ముస్లిం మహిళ అయి ఉండి వినాయకుడి లడ్డును దక్కించుకోవడంతో స్థానికులు ఆమెను ఘనంగా సత్కరించారు.