ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బసవపురంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖిల్లో గ్రామంలోని మూడు దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సరిగా లేవని, స్టాక్ బోర్డు ప్రదర్శించలేదని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎరువుల అమ్మకాలను నిలిపి వేశామని అధికారులు తెలిపారు.