బుధవారం రామసముద్రం మండలం మినికి గ్రామంలో యూరియా నిల్వలు మరియు రైతులకు యూరియా పంపిణీ ని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... పండించే ప్రతి ఎకరాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారికి ఇతర సిబ్బందికి తగు సూచనలు చేశారు.