మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వలస ఆదివాసులు వేసుకున్న గుడిసెలను గురువారం సాయంత్రం తొలగించారు. ఇదిలా ఉండగా గుడిసెలు తొలగిస్తుండగా అడ్డుకున్న ఓ గుత్తి కోయ వ్యక్తిపై అటవీశాఖ అధికారి దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. చేతితో, ఆ తర్వాత అతని వద్ద ఉన్న లాటితో కొట్టడంపై సిపిఎం నాయకులు మండిపడుతున్నారు. వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకొని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.