అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఆలమూరుకు చెందిన ఎలక్ట్రీషియన్ సుధాకర్ నాయుడు కు గాయాలయ్యాయి. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.