ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగదల్పూర్ వద్ద రైల్వే ట్రాక్ నీటమునిగింది. ఈ పరిస్థితి వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీని ఫలితంగా విశాఖపట్నం-కిరండోల్, కిరండోల్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు విశాఖ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు.యుద్దప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.