Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు 16లక్షల విలువ చేసే 32ద్విచక్ర వాహనాలు స్వాధీనం:కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్

India | Sep 12, 2025
16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని కర్నూలు రెండవ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు. కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us