16 లక్షల విలువ చేసే 32 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని కర్నూలు రెండవ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని భూపాల్ కాంప్లెక్స్ దగ్గర ఒక బైక్ దొంగలించారని కర్నూలు, లక్ష్మీనగర్ కు చెందిన నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు. కర్నూలు టు టౌన్ సిఐ , ఎస్సైలు, పోలీసు కానిస్టేబుల్స్ రవి కుమార్, శ్రీనివాసులు, మహేంద్రలు కలిసి ఒక స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితున్ని పట్టుకోవడాని చర్యలు చేపట్టారన్నారు.