నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ బజార్ పనులను గురువారం పర్యవేక్షించారు. నిర్దేశించిన సమయంలోగా అన్ని పనులను పూర్తిచేసి, స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.