పీలేరు మండలం తలుపుల జెడ్ పి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులు - నివారణ చర్యలు అనే అంశంపై గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శ్రీగిరీషా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీగిరీషా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్య సాధనలో ముందుకు సాగాలంటే వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత నిస్తూ, బయట ఆహార పదార్థాలను తినరాదని, ఇంట్లో తయారుచేసిన మంచి పౌష్టికాహారం,స్థానికంగా లభ్యమయ్యే సీజనల్ పండ్లను భుజించాలని, తగినంత నిద్ర , సురక్షిత నీరు, చేతులు శుభ్రత పాటిస్తూ దోమకాటు నుండి మనల్ని మనం కాపాడుకోవాలన్నారు