అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నగరానికి చెందిన గౌతమి అనే వివాహిత సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.