కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నేపాల్ లో జరుగుతున్న అల్లర్ల వల్ల ఆ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 215 మంది తెలుగువారిని నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువచ్చిన యువ నాయకుడు మంత్రి లోకేష్ పట్టుదలను కృషి మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం అన్నారు.