కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిదిలోని కొండాపురం మండలంలోని శ్రీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.343 టీఎంసీలు నీటినిల్వ ఉన్నట్లు మంగళవారం జలాశయ అధికారులు తెలిపారు. గండికోట జలాశయంలోనికి జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కులు, క్యాచ్ మెంట్ ద్వారా 600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు.మరియు గండికోట జలాశయం నుండి మైలవరం రిజర్వాయర్ కు 5000 క్యూసెక్కులు, సిబిఆర్ లిఫ్ట్ స్కీంకు 500 క్యూసెక్కులు, డ్రింకింగ్ స్కీముకు 20 క్యూసెక్కులు,నీటి విడుదల కొనసాగుతుందన్నారు.