సంగారెడ్డి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల వంటగదిని, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ధనరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.