జగ్గంపేట మండలం రామవరం 16 నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అవడంతో కాకినాడ జిజిహెచ్ లో జాయిన్ చేయగా మంగళవారం చికిత్స పొందుతూ మరణించాడు. హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వాల్వో బస్సు రామవరం శివారు జాతీయ రహదారిపై సోమవారం రామవరం గ్రామానికి చెందిన తండు రాజుబాబు రోడ్డు దాటుతుండగా బస్సు ఒక్కసారిగా రావడంతో ఢీకొట్టడంతో రాజబాబు రహదారిపై పడడంతో తలకు తీవ్రంగా గాయాలు తగలగా చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్ సహాయంతో కాకినాడ జి జి హెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.