ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల వద్ద నుండి ఎస్పీ సతీష్ కుమార్, పలువురు అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా పరిష్కారమయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.