శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జనసేన నాయకులు ఆదివారం మధ్యాహ్నం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. జనసేన మండల కన్వినర్ జేబీహుల్ల మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమందేపల్లి పెద్దమ్మ గుడి దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి ఎర్రస్వామి, సీనియర్ నాయకులు మహేశ్, బాషా, వీర మహిళలు సుమిత్ర, వరలక్ష్మి, గంగాధర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.