విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదిక ఈ నెల 16న లంకెలపాలెం సబ్ డివిజన్ పరిధిలోని పెదముసిడివాడ సబ్ స్టేషన్లో నిర్వహించనున్నట్లు కశింకోట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.రామకృష్ణ వెల్లడించారు. మునగపాక ప్రాంతంలోని అపరిష్కృత విద్యుత్తు సమస్యలను ఈ వేదిక దృష్టికి తీసుకురావాలని ఓ ప్రకటనలో కోరారు. విశ్రాంత న్యాయమూర్తి బి.సత్యనారాయణ అధ్యక్షతన ఆయా సమస్యలను చర్చించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.