Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయాలి: జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్

Nirmal, Nirmal | Aug 24, 2025
తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిరోధక చట్టం చేయలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు అంకం గంగాధర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనం లో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రాలు, చేతబడుల పేరా అమాయకులపై దాడులు చేయడం, హత్యలు చేయడం చాల విచారకరం అని అన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండా రాములు, అనంత్ విశ్వేషర్, ప్రధాన కార్యదర్శి శేక్ రఫీక్,చెకుముకి కన్వీనర్ నారాయణ వర్మ, వట్టలి ముత్తన్న, పోలకొండా నారాయణ వర్మ, వెంకటరమణ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us