Download Now Banner

This browser does not support the video element.

ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర, జిల్లా స్థాయికి పీలేరుకు చెందిన ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులు ఎన్నిక

Pileru, Annamayya | Aug 24, 2025
ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నికల్లో రాష్ట్ర మరియు జిల్లా స్థాయికి పీలేరు,కేవిపల్లి మండలాలకు చెందిన ముగ్గురు ప్రధాన ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆదివారం అన్నమయ్య జిల్లాలో ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా ఎన్నికలు రాయచోటి బాలికల ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర కౌన్సిలర్ గా పీలేరు మండలం జంగంపల్లికి చెందిన ప్రధానోపాధ్యాయులు తాటిపర్తి గంగాధర్ ఎన్నికయ్యారు.జిల్లా కోశాధికారిగా కేవిపల్లి మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయులు వై వెంకటరమణ ఎన్నికయ్యారు.రాయచోటి డివిజన్ కార్యదర్శిగా పీలేరు మండలం మేళ్ళ చెరువు ప్రధానోపాధ్యాయులు వై.సురేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Read More News
T & CPrivacy PolicyContact Us