నారాయణపేట జిల్లా పరిధిలో చాలా కాలంగా కోర్టులో పెండింగులో ఉన్న కేసుల పరిష్కారం కోసం కక్షి దారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట సిఐ శివశంకర్ శుక్రవారం 4 గం సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 వ తేదీన జాతీయ న్యాయసేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడునని సీఐ తెలిపారు.