కూకట్పల్లిలో వ్యాపారి భార్య రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందం నిందితుల కోసం ఝార్ఖండ్ కు వెళ్ళింది. కాగా నిందితులు హర్ష, రోషన్ రేణు హత్యానంతరం వాడిన స్కూటీని హఫీజ్ పేట రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు.