రాజుపాలెం మండలం కొండమోడు ఫ్లై ఓవర్పై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని 10మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.