ఒరిస్సా నుంచి చెన్నైకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరినీ నెల్లూరు రైల్వే పోలీస్ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 లక్షల 50 వేలు విలువచేసే 22.5 కిలోల గందైన సీజ్ చేసినట్లు డిఎస్పి మురళీధర్ తెలిపారు. చెన్నైకి చెందిన రాజేష్ నుంచి 14.5 కిలోలు, మరో మహిళ జాబునిషా నుంచి 8 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి విషయం బయటపడిందని తెలిపారు.