హిరమండలం గొట్ట బ్యారేజ్లో వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. మంగళవారం 11 వేల 440 క్యూసెక్కుల నీరు పెరిగిందని డీఈ సరస్వతి తెలిపారు. ఈ మేరకు ఎడమ కాలువకు 1,432 క్యూసెక్కులు, నదిలోకి పదివేల క్యూసెక్కుల నీరు విడిచి పెట్టామన్నారు. 14 గేట్లు తెరిచినా వరద ఉద్ధృతి కొనసాగుతుందన్నారు.