కడప జిల్లా కమలాపురం మండలంలోని పాపాగ్ని నదిపై నూతనంగా నిర్మించిన వంతెనపై గురువారం నుంచి అధికారులు రాకపోకలను ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన భారీ వరదలకు పాత వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు అదే స్థానంలో నూతన వంతెనను నిర్మించారు.దీంతో నేటి నుండి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.