ఏటూరునాగారంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. స్థానిక ITI కళాశాల వెనుక పిడుగుపాటు కారణంగా 5 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.