పులివెందుల పట్టణంలోని కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాప్లో ఉన్న తనపై కొంతమంది దాడి చేసినట్లు యూ ట్యూబర్ ఆదిశేషు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'నాపై తుమ్మలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డి, అతని అనుచరులు పైపుతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తన చెయ్యి విరగడంతోపాటు కారును పగలగొట్టారని పేర్కొన్నారు.