యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన కొండూరి చంద్రయ్య ప్రమాదవశాత్తు ఆదివారం తలకిందులయ్యారు. ఈ సందర్భంగా చెట్టు దిగుతుండగా మోకు జారిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అరగంట పాటు చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ చంద్రయ్య నరకయాతన అనుభవించాడు. ఇది గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా కిందికి దించారు. ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.