మోపిదేవిలో సీసీ కెమెరాలను పరిశీలించిన చల్లపల్లి సీఐ స్తానిక మోపిదేవి మండలం మెరకనపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చల్లపల్లి సీఐ ఈశ్వరరావు గురువారం మద్యాహ్నం 4 గంటల సమయంలో పరిశీలించారు. గ్రామంలో నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు గ్రామస్థుల సహకారంతో ఛైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మొత్తం 22 సీసీ కెమెరాలను ఎస్ఐ సత్యనారాయణతో కలిసి సీఐ పరిశీలించారు.