గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు వలన కామారెడ్డి నుంచి సిరిసిల్ల వెళ్లే బ్రిడ్జి పై నుంచి అధిక వరద వెళ్ళి బ్రిడ్జి చెడిపోయి రాకపోకలు ఆగిపోయినందున ఈ బ్రిడ్జిని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలిక రోడ్డు నుండి రాకపోకలు ప్రారంభించేలా త్వరగా మరమ్మతులు పనులు పూర్తి చేయాలనీ, తదుపరి రానున్న రెండు, మూడు రోజులు జిల్లాలో అధిక వర్ష సూచన ఉన్నది కావున ఇట్టి రోడ్డుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పల్వంచ గ్రామంలో సానిటేషన్ ను పరిశీలించి, అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు.