Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కోడిగాండ్లపల్లె : గ్రామంలో విజృంభిస్తున్న విష జ్వరాలు...ప్రజలకు సూచనలిచ్చిన డీఎంహెచ్ఓ, వైద్య సిబ్బంది

India | Sep 10, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లెలో విష జ్వరాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయని స్థానికులు తెలిపారు. బుధవారం తెల్సిన వివరాల మేరకు వైద్యాధికారులు గ్రామంలో పర్యటించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా... జ్వరాలు అదుపు చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ గ్రామంలో 20 రోజులుగా విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దాదాపు 30 నుంచి 40 మంది పిల్లలు జ్వరాల బారిన పడ్డారు. చాలామంది పిల్లలకు రక్త కణాలు తగ్గిపోవడంతో డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us