ప్రకాశం జిల్లా దర్శి మండలాన్ని జిల్లాలోనే ఉంచాలని లేదంటే రైతు కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయని దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయాల మేరకు సర్వే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.