సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హుండీలను గురువారం తెరిచి లెక్కించారు. మొత్తం 83 రోజులకు గాను స్వామివారి ఆలయంలో అన్ని హుండీలు కలిపి రూ. 35,62,444 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలియజేశారు. నగదుతో పాటుగా నాలుగు గ్రాముల బంగారం, 39 గ్రాములు వెండి వస్తువులు, పలు దేశాల కరెన్సీ నోట్లు లభించేయన్నారు.