లడ్డూను దక్కించుకున్న చిత్తూరు MLA చిత్తూరు డీఐ రోడ్డులో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. బుధవారం రాత్రి నిమజ్జన ఊరేగింపులో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారికి ఎమ్మెల్యే మంగళహారతి సమర్పించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంపాట జరిగింది. రూ.4 లక్షలకు ఎమ్మెల్యే లడ్డూను కైవసం చేసుకుని భక్తులకు పంచిపెట్టారు.