శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులకు తెలియజేశారు. రైలు కింద పడి మృతి చెందాడా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మృతికి గల కారణాలు, మృతుని పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి వుంది.