Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం, కాకివాయి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి కలువాయి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎక్కడానికి వచ్చిన వృద్ధురాలు అంకమ్మను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.