వైసీపీ రాష్ట్ర మహిళా కార్య దర్శి పేరం స్వర్ణలతను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలిశారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుకుని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇప్పటికే పేరం స్వర్ణలతను YS జగన్ సైతం ఫోన్లో పరామర్శించారు.