గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీను అమలు చేయాలని CITU జిల్లా అధ్యక్షులు రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కెరమెరి ఎంపిడిఓ కార్యాలయంలో ఎదుట నిరసన తెలుపుతూ మాట్లాడారు..జీవో 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు కనీసం రూ.26 వేలు చెల్లించాలని GP కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు