భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిఖార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ ఆవరణలో రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఉద్యమాలతో ఎంతో మంది స్ఫూర్తి పొందరన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశైలిగా పెరుపొందరన్నారు.