కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి విషాద ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామానికి చెందిన చింటూ (23) ఉట్టి కొట్టేందుకు ఇనుప పైపులు భూమిలో పాతుతుండగా చేతుల నుంచి జారి విద్యుత్ తీగలపై పడింది. విద్యుత్ షాక్తో చింటూ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.