కంది మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎర్దనూర్ గ్రామంలో గురుమూర్తికి చెందిన బైక్ను దొంగలు అపహరించుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దొంగలు కర్రలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ బుధవారం తెలిపారు. ఇస్మాయిల్ ఖాన్ పేటలో కూడా దొంగతనం చేయడానికి విఫలయత్నం చేశారు.