వినాయక శోభయాత్రలో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలనిఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఎస్పీ స్వయంగా పర్యటించి పలు వినాయక మండపాలను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరైన సమయంలో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ జీవన్ రెడ్డి సీఐలు, ఎస్సైలు ఉన్నారు.