మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి 44 పై స్వామి వివేకానంద విగ్రహం వద్ద మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ యువకుడి శరీరం పైనుండి వెళ్లడంతో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.